Friday, December 14, 2012

2 వ భాగం :

ఈ సహస్ర చతుర్యుగ  పర్యాప్తమైన బ్రహ్మ కాలాన్ని పదునాలుగు మన్వంతరాలు గా విభజించారు . ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధిపతి. అనగా పరిపాలనా కాలం.  ఇప్పుడు నడుస్తున్నది 7వ మనువు వైవస్వతుని పరిపాలన లో వున్నాము. మిగతా ఆరుగురి పేర్లు వరుసగా  . . . .
స్వాయంభువుడు, సారోచిషుడు, ఔత్తమి, తామసుడు, రైవతుడు, చాక్షుడు,  ఇందులో ఒక్కకరి పరిపాలనా కాలం 74 1/2 చతుర్యుగాలు కాలం మాత్రమే .

వైవస్వతుని తరువాత మరి ఏడుగురి మనువుల కాలం గడిచిన తరువాత బ్రహ్మ దివాసాతం  లో నైమతిక ప్రళయం సంభవిస్తుంది. వైవస్వతుని తరువాతి మనువుల పీర్లు వరుసగా . . . . 

సావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి.  

మనము ఇప్పుడు వర్తమాన బ్రహ్మ జీవితం లోని ద్వితీయ పరార్ధం లో పద్మ (వరాహ) కల్పం అనబడుతున్న ప్రధమ దివసం లో సప్తమ మనువు ఐన  వైవస్వతుని కాలం లో వున్నాము .

వీరి కర్తవ్యం భగవదవతారాల నియమాలననుసరించి ధర్మ రక్షణ, ప్రజాభివృద్ధి  కావించడం.  మనువు సహాయానికి ఇంద్రుడు, సప్తరుషులు ఉద్భావిస్తుంటారు.

చతుర్యుగావసానంలో ప్రతి కలియుగాన్తానికి లోకం లో వేద ధర్మానికి ఆదరువు నశించి వేదాలు కాలగర్భం లో కలసి పోతాయి.అప్పుడు మహర్షులు జన్మించి తపొమూలకమ్గా వేదాలను పునరుధరిస్తారు.  

ప్రతి మన్వంతరం లోను అనగా 76 చతుర్యుగాలు కాలంలోనూ నాలుగు మహా యుగాల పునరావృతి లోను ప్రతి కృత యుగం ధర్మం పరంకాష్టతో మొదలై నానాటికి ధర్మచ్యుతి సంభవించి చివరికి కలియుగం అధర్మ నిలయం అవుతుంది. అప్పుడు తిరిగి భగవానుడు కల్క్యవతారం ధరించి ధర్మాన్ని పునరుద్ధరించి సత్యకాలం తో మళి ఒక చతుర్యుగం ఆరంభం అవుతుంది .

కొన్ని వివరాలు : మొదటి మనువు ఐన స్వాయ్మ్భువుని కాలం లో ధ్రువుని చరిత్ర,కపిలావతారం జరిగాయి. ఆ తోలి రోజులలొ మనుష్య ఆయుర్దాయం చాలా ఎక్కువగా వుండేది.  ఉదాహరణకి ధ్రువుని పరిపాలనా కాల వ్యవధి 30,000 సంవత్సరాలు.  




  నాకు  తెలియని బ్రహ్మ జీవిత కాలం 

సమాచారం శ్రీ మద్బాగవతం  నుండి గ్రహించ బడినది 

అంతర్జాలం లో ఈ విషమయం గూర్చి న  సమాచారం కనిపించినా  అంత వివరణాత్మకంగా అనిపించ  లేదు ! 

అందుకనే ఈ పోస్ట్ ! ! !

బ్రహ్మదేవుడు జగత్ సృష్టి కర్త . శ్రీ మహావిష్ణువు సృష్టి రచన ను సంకల్పించినప్పుడు ప్రభవించిన వాడు బ్రహ్మ దేవుడు.  ఈ సృష్టి జరిగే కాలం బ్రహ్మ కు ఒక పగలు.  ప్రళయ కాలం రాత్రి.  

వేయి చతుర్ యుగాలు అనగా కృత లేదా సత్య , త్రేతా, ద్వాపర , కలి యుగాలు కలసి   (ఓక చతుర్యుగము 43,20,000 మానవ సంవత్సరాలు ) బ్రహ్మ  కి ఒక పగలు.  పగలు భూత సృష్టి జరిగి తే రాత్రి కాలం లో సత్య లోకం వరకు గల లోకాలన్నీ   ప్రళయ పయోధి జలాలలో ముణిగి  పోతాయి . రాత్ర్యంతం లో బ్రహ్మ రూపదరుడైన శ్రీ మహావిష్ణువు మేల్కొని తిరిగి సృష్టికి ఉపక్రమిస్తాడు.  ఇలా బ్రహ్మ కాలం  లో  ప్రతి రాత్రి జరిగే ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు.

ఇటువంటి నైమిత్తికప్రలయాలు 360 కలసి బ్రహ్మ కి ఒక సంవత్సరం. అతని జీవితం కాలం నూరు సంవత్సరాలు.  అనగా దీనిని మానవ మానం లోకి మార్చితే . . . . . . .

ఒక సంవత్సరం ఒక రోజు చొప్పున 360 మనవ సంవత్సారాలు దేవతలకి ఒక రోజు. అటువంటి 12000 దేవా మనవ సంవత్సరాలు అనగా ఒక చతుర్యుగం.  ఇటువంటి రెండు వేలు చతుర్యుగాలు బ్రహ్మ కి ఒక పగలు రాత్రి (ఒక రోజు) 360 అహో రాత్రాలు బ్రహ్మ కి ఒక సంవత్సరం.  దీనిని బట్టి మనవ మానం లో బ్రహ్మ జీవిత కాలం  31,10,40,00,00,00,000 సంవత్సరాలు. ఈ జీవిత కాలాన్ని రెండు పరర్దాలు గ విభజించారు.

బ్రహ్మ జీవిత  కాలం అంతం లో ప్రాకృతిక ప్రళయం సంభవించి వ్యక్తావ్య్క్తాత్మిక సమస్తం ప్రక్రుతి లోకి లీనము అయిపోయి, ఆ ప్రకృతి అవ్యక్తము లోకి విలీనం అయిపోతుంది.  అప్పుడి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర కి ఉపక్రమిస్తాడు.

సృష్టి కాలం వలనీ ప్రళయ కాలమ గూడా రెండు పరార్దాలు గడిచిన తరువాత ఏమి లీనటువంటి స్తితి లో చైతన్యం సృష్టించబడి నారాయణ నాభి కమలం నుంచి ఒక అపర బ్రహ్మ ఉదయించి మళ్ళే  సృష్టిక్రమము  మొదలు పెడుతాడు.

 

  1 వ భాగం సమాప్తం ! ! !

తిరిగి మరికొంచం  . . . . . . 2 వ భాగం లో 

  

 


 


 

Saturday, February 6, 2010

మంచితనం కనుమరుగు అవుతున్న వేళ !

మంచితనం కనుమరుగు అవుతున్న వేళ !

మాయాబజార్ లాంటి చిత్రాలు రంగులు పులుము కుంటే , ఈ తరం వారికి ఆ సంస్కారం, ఉదాత్తత, పొరుగు వారి తో మెలిగే విధానము, మన్నన అన్ని చూసి విచిత్రం అనిపించవచ్చు ! కాని అవి ఆచరిస్తే ఎంత బాగుంటుంది ? ఒరే (ఈ కాలం భార్య భర్తని పిలిచే సంభోదన !) సంస్కృతి నుండి బయట పడుతుంది ఏమో ?

కనుక పాత చిత్రాలన్నీ రంగులు కావల సిందే . ఒక శ్రీ కృష్ణ పాండవీయం, ఒక సీతా రామ కల్యాణం , ఒక కన్యా శుల్కం ..............

ఆశా కాదేమో ! అవసరము కూడా !

Tuesday, January 12, 2010

శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులందరికీ చందమామ వారి

సంక్రాంతి శుభాకాంక్షలు

Monday, January 11, 2010

ఒక మంచి కథ









ఒక మంచి కథ : ఇది చందమామ లో మే 1953 వచ్చింది చదివి ఆనందించండి

Friday, January 8, 2010

కలర్ మాయాబజార్ గురించి మరి కొన్ని విషయాలు :






కలర్ మాయాబజార్ గురించి మరి కొన్ని విషయాలు :

Thursday, January 7, 2010

కలర్ బజార్ - ఈ మాయాబజార్ ఇక నుంచి మన తెలుగు వారికి











కలర్ బజార్ - మాయాబజార్ ఇక నుంచి మన తెలుగు వారికి
అది తెలుసు కోవాలంటే ఈ పోస్ట్ చదవాల్సిందే !
.



:





మచ్చుకి
కొన్ని చిత్రాలు
పైన :




తెలుగు చలన చిత్ర చరిత్రలో "మాయాబజార్" దీ ఒక ప్రత్యెక అధ్యాయం . ఈ చిత్రం ౧౯౫౭ మార్చి ౨౭ న విడుదలయింది.
కే వి రెడ్డి దర్సకత్వపు ప్రతిభ కి, విజయావారి నిర్మాణ శైలి కి ఇది ఒక తార్కాణం. ఇందులోని ప్రతి పాత్ర జీవం ఉట్టిపడుతుంది. రామారావు, రంగారావు, సావిత్రి, రీలంగి ప్రతి ఒక్కరు పాత్ర కి జీవం పోశారు. చిత్రాన్ని ఒక మైలు రాయి గా నిలిపారు.

ఈ నలుపు - తెలుపు చిత్రం ఇప్పుడు రంగులు అద్దుకుంది. ఈ చిత్రాన్ని రంగుల లో విడుదల చెయ్యటానికి రంగం సిద్దమైంది. ఈ పుణ్యం ని గోల్డ్ స్టోన్ టెక్నాలజీ అనే సంస్థ కట్టుకుంది. అది ఒక్కటీ కాదు, సినిమా స్కోప్, డి టి ఎస్ లో ఎఫ్ఫెక్ట్స్ లో విడుదల కి సన్నాహం చేసారు.